2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచే మహేంద్రసింగ్ ధోని గురించి తెరమీదకి వచ్చిన ఒక వార్త అభిమానులు అందరిని కూడా ఆందోళనకు గురిచేసింది అన్న విషయం తెలిసిందే. అదేంటంటే మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ అని ఇక ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోని ఐపిఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని ధోని కంటే ఎక్కువ ధర పెట్టి అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది.


 దీంతో ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేసి చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అటు బెన్ స్టోక్స్ కి అప్పగిస్తారు అంటూ కూడా వార్తలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ధోని కి ఇదే చివరి ఐపిఎల్ అంటూ వస్తున్న వార్తలు గురించి పలువురు మాజీ ఆటగాళ్లు స్పందించి తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మోయిన్ అలీ సైతం స్పందించాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చివరి ఐపీఎల్ సీజన్ అనే మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ కేదార్ జాదవ్ అభిప్రాయపడగా.. ఇక అటు కేదార్ జాదవ్ వ్యాఖ్యలను మాత్రం కొట్టి పారేశాడు మోయిన్ అలీ. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ ఉన్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అతను ఆడుతున్న తీరు.. అతని బ్యాటింగ్ చూస్తుంటే.. కచ్చితంగా మరో మూడు సీజన్లు ధోని తప్పకుండా ఐపీఎల్ ఆడతాడు అంటూ మోయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. ఇక మోయిన్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆట అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే నిజమైతే బాగుండని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl