ఇక IPL 16 వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం నాడు రాజస్తాన్‌ టీంతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఏడు పరుగుల తేడాతో బెంగళూరు నెగ్గింది. కాగా ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ ఇంకా గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.ఐపీఎల్ చరిత్రలో థర్డ్ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించడం జరిగింది.ఇంకా అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును కూడా కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్‌ టీంతో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ కూడా మూడో వికెట్‌కు ఏకంగా 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది. ఇక అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17 వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  మొత్తం 126 పరుగులతో పాట్నర్‌షిప్‌తో సూపర్ గా అదరగొట్టారు.


2017 వ సంవత్సరంలో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్‌లో డుప్లెసిస్(62) ఇంకా మ్యాక్సీ(77) ఆ రికార్డును ఈజీగా బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టడం జరిగింది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్‌ చరిత్రలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది.ఇక మూడో వికెట్‌కు మాత్రం ఇదే బెస్ట్.ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించడం జరిగింది. ఈ టి20 క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంకా ఈ ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని కూడా అందుకున్నాడు. పలితంగా ఈ IPL ఫార్మాట్‌లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: