భారత క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టులోకి వచ్చి తక్కువ సమయంలోనే కెప్టెన్సీ చేపట్టాడు. ఇక తన కెప్టెన్సీ తో తిరుగులేని విజయాలను అందించి ఎన్నోఘనతలు సాధించాడు. ఏకంగా భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ను రెండుసార్లు అందించాడు. ఇక ఐసిసి ట్రోఫీ కూడా అందించి మూడు ఫార్మాట్లలో ఐసిసి టైటిల్స్ గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా కూడా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో వెలుగొందుతున్నాడు మహేంద్రసింగ్ ధోని.



 ఇక మరోవైపు ఐపీఎల్ హిస్టరీలో సైతం నాలుగు సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గాను మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ల జాబితాలో మొదటి వరుసలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం కేవలం ఐపిఎల్ ద్వారా మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని.. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక సిఎస్కే మ్యాచ్ ఎక్కడ ఆడినా కూడా భారీగా చెన్నై అభిమానులుతలలు వస్తూ దోనికి మద్దతు ప్రకటిస్తున్నారు.



 ఇకపోతే ఇటీవల ధోని కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ ధోని పోలిన మరో మనిషి ఉన్నాడు అన్నది వీడియో చూస్తే అర్థమవుతుంది. నేరిసిన గడ్డం చెన్నై సూపర్ కింగ్స్ జర్సీ ఇక ధోని లాంటి చూపులతోనే స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాని కెమెరా కంటపడ్డాడు. అచ్చం అతను ధోని లాగే ఉన్నాడు. దూరం నుంచి చూస్తే నిజంగా ధోనినే అనిపిస్తుంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన 41 మ్యాచ్లో ఇది జరిగింది. ఈ వీడియో పై స్పందించిన ఒక అభిమాని టైం ట్రావెల్ లో ముందుకెళ్లి చూడండి.. 2040 లో ధోని ఇలాగే ఉంటాడు అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: