ఎప్పుడు బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. అయితే ఇక రెండు మూడు సార్లు అవకాశం వచ్చినప్పటికీ తనను తాను నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు కుల్దీప్ యాదవ్. రోజురోజుకు ఇలా కుల్దీప్ యాదవ్ కెరీర్ కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతోంది అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో ఎంపికయ్యాడు కుల్దీప్ యాదవ్. అయితే ఐపీఎల్లో ఎంపిక అయినప్పటికీ ఇక చివరికి తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేక పోయాడు. కేవలం బెంచ్ కి కు మాత్రమే పరిమితం అయ్యాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్లో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ప్లేయింగ్ ఎలవెన్ లో ప్లేస్ దక్కకపోవడం ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చాడు ఒక్కసారైనా తనకు అవకాశం ఇవ్వకపోవడం పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు కుల్దీప్ యాదవ్ .. తాను మరీ ఇంత ఘోరమా అంటూ ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే మీడియాలో కూడా ధోని మార్గనిర్దేశనం మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు కుల్దీప్ యాదవ్. రిషబ్ పంత్ కి కాస్త అనుభవం వస్తే ధోనీ లాగానే నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు.