టీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇక అతని స్పిన్ మాయాజాలానికి అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వికెట్లు పడగొట్టి ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు కుల్దీప్  యాదవ్. కానీ ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో ఫామ్ కొనసాగించలేకపోయాడు. ఇక ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ కెరియర్ కాస్త ప్రశ్నార్థకంగా మారిపోయింది. అటు ఇక్కడ అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు కుల్దీప్ యాదవ్. ఒకవేళ అవకాశం దక్కించుకున్న తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.



 ఎప్పుడు బెంచ్  కే పరిమితం అవుతున్నాడు. అయితే ఇక రెండు మూడు సార్లు అవకాశం వచ్చినప్పటికీ తనను తాను నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు కుల్దీప్ యాదవ్.  రోజురోజుకు ఇలా కుల్దీప్ యాదవ్ కెరీర్  కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతోంది  అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో ఎంపికయ్యాడు కుల్దీప్ యాదవ్. అయితే ఐపీఎల్లో ఎంపిక అయినప్పటికీ ఇక చివరికి తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేక పోయాడు. కేవలం బెంచ్ కి కు మాత్రమే పరిమితం అయ్యాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఐపీఎల్లో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ప్లేయింగ్ ఎలవెన్ లో ప్లేస్ దక్కకపోవడం ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చాడు  ఒక్కసారైనా తనకు అవకాశం ఇవ్వకపోవడం పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు కుల్దీప్ యాదవ్ .. తాను మరీ ఇంత ఘోరమా అంటూ ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు  అయితే మీడియాలో కూడా ధోని  మార్గనిర్దేశనం మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు కుల్దీప్ యాదవ్. రిషబ్ పంత్ కి కాస్త అనుభవం వస్తే ధోనీ లాగానే నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: