కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన కారణంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఏకంగా ఒక కెమెరా వల్ల మ్యాచ్ నిలిచిపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో చివరి బంతికి కివీస్ కెప్టెన్ టామ్ లూతమ్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ఆ సమయంలో ఇక అక్కడ మొత్తం చిత్రీకరించేందుకు ఉపయోగించే స్పైడర్ కెమెరా కి పిచ్చి కి కొంత ఎత్తులో ఎటు కదలకుండా అక్కడే ఆగిపోయింది.
సిబ్బంది దానిని పైకి లాగేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈ సమస్య పరిష్కరించడానికి కొంత సమయం పట్టింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు విరామం ప్రకటించారు.. ఇక స్పైడర్ కెమెరా ఆగిపోవడంతో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఆ కెమెరా వద్ద సరదాగా ఆడుకున్నారు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమైంది పైకి పో అంటూ సరదాగా వెళ్ళిపోయాడు.. ఇక రవిచంద్రన్ అశ్విన్ బాహుబలిలో ప్రభాస్ శివలింగం ఎత్తుకున్నట్లుగా ఫోజులు ఇచ్చాడు.