గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉండటం గమనార్హం  సెంచరీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు గడిచిపోతున్నాయి అనే చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కోహ్లీ పేలవమైన ఫామ్ పై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  కోహ్లీకి ఎంతో సన్నిహితంగా ఉండే  టీమిండియా మాజీ కోచ్ ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మానసికంగా అలసిపోయాడు.  అతనికి రెండు నెలల విశ్రాంతి ఇస్తే సర్దుకుంటుంది అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడం గమనార్హం.


 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రిఈ వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీ మానసికంగా అలసిపోవడం ఆటపై ప్రభావం చూపిస్తుంది. 2019 నవంబర్ తర్వాత కోహ్లీ  సెంచరీ చేయలేదు. అతను సెంచరీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్లో అయినా ఆ కోరిక తీరుస్తాడు అనుకుంటే నిరాశే ఎదురవుతుంది.  సెంచరీ అందుకోవాలనే తాపత్రయంతో కోహ్లీ అంతకంటే ఎక్కువ ఒత్తిడిలో  నలిగిపోతున్నాడూ. ఏమైనా ఆటగాడి పట్ల సానుభూతితో ఉండాలి. అనవసరంగా ఒత్తిడి తీసుకు రాకూడదు అంటు రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు



 ఇక కోహ్లీ ఒత్తిడిని జయించడానికి  అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి కావాలి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అయినా సరే లేదా ఆ తర్వాత అయినా సరే రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా 7 ఏళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉంది. ఇలాంటి సమయంలో ఒత్తిడితో ఆటకు దూరం కాకూడదు. కేవలం కోహ్లీ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు అంటు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: