దీంతో ఎంతో మంది అభిమానులు నిరాశ లో మునిగిపోయారు. కాగా ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎబి డివిలియర్స్ లేకుండా ఎందుకొ సరిగ్గా రాణించలేక పోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంగళూరు జట్టుతో మరోసారి ఎబి డివిలియర్స్ జతకట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు ఏకంగా అతని సహచరుడు స్నేహితుడు ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక క్లూ వదలడంతో ప్రస్తుతం ఇక ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
మిస్టర్ నాగ్ తో జరిగిన ఒక ఫన్నీ ఇంటర్వ్యూ లో భాగంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎబి డివిలియర్స్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో ఎబి డివిలియర్స్ అర్సిబి లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు ఏమో అంటే కీలక వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా ఎబి డివిలియర్స్ ను ఎంతగానో మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు ఎబి డివిలియర్స్. అమెరికాలో గోల్ఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆర్సీబీ మ్యాచ్ ను తప్పక ఫాలో అవుతూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక రాబోయే సీజన్లో ఎబి డివిలియర్స్ మళ్లీ ఫామ్ లోకి రావచ్చేమో అటు కామెంట్ చేశాడు కోహ్లీ..