అయితే ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ మొదటి టెస్టులో ఇలా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సమయంలో కూడా అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఇషాన్ కిషన్ నెమ్మదిగా బంతులను ఎదుర్కొంటూ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సడన్గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంతో అటు ఇషాన్ కిషన్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి. ఈ విషయంపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. కాగా సడన్గా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గురించి రోహిత్ శర్మ ఇటీవల స్పందించాడు.
అంతేకాదు తాను ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి వెనుక కారణం ఏంటి అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అవుట్ కాగానే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఇక ఇషాన్ కిషన్ తొలి టెస్ట్ లో తన పరుగుల ఖాతా తెరిచిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అందుకే ఇషాన్ కిషన్ ఒక పరుగు చేయగానే ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాను అంటు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. ఇక అటు వెంటనే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం లో మునిగిపోయారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి