కేవలం ఇండియాలోనే కాదు కోహ్లీ ఆటను ఆరాధించే క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే రికార్డుల విషయంలో నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. కేవలం రికార్డులు మాత్రమే కాదండోయ్.. అటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకోవడం విషయంలో కూడా అతనికి సాటి ఎవరూ లేరు. అయితే ఇలా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ఇటీవల మరో అరుదైన రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు.
ఏకంగా 5వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు విరాట్. సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు మాత్రమే ఇప్పటివరకు 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు వీరు సరసన కోహ్లీ చేరాడు. అయితే ఇదే విషయం గురించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు. చరిత్రలో కోహ్లీ సాధించిన రికార్డులు, గణాంకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఘనత సాధించడానికి కోహ్లీ పడిన శ్రమ ఎవరికీ తెలియదని.. ఇక కోహ్లీ పట్టుదలే 500 మ్యాచ్లు ఆడేలా చేసిందని.. యువకులతో పోటీపడే అతని ఫిట్నెస్ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి