అక్టోబర్ నెల నుంచి మనదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే 5జీ సేవలు ప్రారంభం కావడానికి ముందే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 6జీ సేవల గురించి కూడా కామెంట్స్ చేశారు.2030 చివరి నాటికి మనదేశంలో 6జీ సేవలను ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఇక స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022 గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రకటన వచ్చింది.మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ దశాబ్దం చివరికి 6జీ లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గేమింగ్ ఇంకా అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో భారతీయ సొల్యూషన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఇక మనదేశంలో 5జీ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 12వ తేదీ కల్లా 5జీ సేవలు మనదేశంలో ప్రారంభం అవుతాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం కూడా ఇచ్చారు. మొదటగా 13 నగరాల్లో 5జీ సేవలను అందించనున్నారు.


అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సర్వీసులు మొదటగా ప్రారంభం కానున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్ ఐడియాల నుంచి టెలికాం శాఖకు ఇప్పటికే రూ.17,876 కోట్ల మొత్తం అందింది.పైన పేర్కొన్న 13 నగరాల్లో 5జీ మొదటగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 5జీని దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా దేశం మొత్తం 5జీ కవరేజ్ రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దేశంలో 5జీ టెస్టింగ్ అయితే ఇప్పటికే ప్రారంభం అయింది.కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇంతవరకు 4జీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 5జీని త్వరలో బీఎస్ఎన్ఎల్ తీసుకురానుందని తెలుస్తోంది. 5జీ సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇటీవలే టెలికమ్యూనికేషన్స్ డిపార్టెమెంట్ (డీఓటీ) పర్మిషన్ కోరింది. ఈ పర్మిషన్ వస్తే త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

6G