తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు చివరి దశకు చేరుకుంది. బుల్లితెరపై బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మొదలైన ఈ షో 3 సీజన్ లను  విజయవంతంగా పూర్తి చేసుకుంది . ఈ రియాలిటీ షో పై రోజురోజుకు ఆసక్తి మరింత ఎక్కువగా పెరిగిపోతోంది. ఇన్ని రోజులు రేటింగ్స్ తగ్గుతూ పెరుగుతూ వస్తున్న విషయం  తెలిసిందే. కానీ కంటెస్టెంట్ లు రేటింగ్స్ ను పట్టించుకోకుండా ప్రేక్షకుల ఫీలింగ్స్ ను పట్టించుకుని బాగానే హడావుడి చేశారు. ఇక షో దాదాపు ఎండ్ కార్డుకు దగ్గరగా చేరుకుంది. హోస్ట్ నాగార్జున వివిధ ప్రణాళికలతో షో స్థాయిని పెంచే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు..

 ఎంటర్టైన్మెంట్ జోరు పెంచేందుకు ప్రముఖ సినీ తారలు బిగ్బాస్ స్టేజ్ పై మెరవడం తో ఈ మధ్య రేటింగ్ భాగానే పెరిగింది. ఈ షోపై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ముందు సీజన్లల లోని కొందరు కంటెస్టెంట్స్ సైతం సీజన్ ఫోర్ ఫై రకరకాల భావాలను వ్యక్తం చేస్తున్నారు.
బిగ్బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్... నోయల్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నోయల్ బిగ్ బాస్ షో గురించి చేసేదాకా షాకింగ్ కామెంట్స్ సంచలనం సృష్టించాయి. బిగ్బాస్ షో కు తిరిగి రమ్మని ఆఫర్ ఇచ్చినా సరే ససేమిరా కుదరదని చెప్పిన విధంగా తెలుస్తోంది... అంతేకాదు ఇటీవల హారిక బ్రదర్ వంశీ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా పెదవి విప్పిన నోయల్... బిగ్ బాస్ హౌస్ ని ఎంచుకోవడమే  పొరపాటని, బిగ్ బాస్ షో కి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఎందుకు ఏమిటి అన్న వివరాలు చెప్పలేదు కానీ బిగ్ బాస్ షో కి వెళ్లినందుకు అసహనాన్ని వ్యక్తం చేశారు నోయల్. ఇక సీజన్ ఫోర్ విన్నర్ ఎవరు విజయం సాధిస్తారు.... అని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు....  అభిజిత్ విన్నర్ గా నిలుస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు నోయల్...

మరింత సమాచారం తెలుసుకోండి: