ఇప్పుడు అత్యంత వేగంగా వెళ్లేటటువంటి వాహనాలను మనం నడుపుతున్నాం. అలా వేగంగా వాహనాలతో వెళ్లడం వల్ల ఒకసారి యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. కొన్ని పరిస్థితులలో మరణమే సంభవించవచ్చు. ఇక మనమే కాకుండా మనల్ని ఎంతగానో అలరించే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, నటుల ఫ్యామిలీ నుండి ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక నటి, తన ఫ్యామిలీ అంతా ఈ రోడ్ ప్రమాదంలో చనిపోయారట, ఆ నటి గురించి తెలుసుకుందాం.


మా టీవీలో ప్రసారమయ్యే "మనసిచ్చి చూడు" సీరియల్ లో నటించిన నటి కీర్తి. ఈమె తాజాగా  మా టీవీలో ప్రసారమయ్యే "ఛాంపియన్షిప్"ప్రోగ్రాం లోకి వచ్చింది. ఇక ఇందులో కూడా కార్తీకదీపం హీరో డాక్టర్ బాబు కూడా వచ్చాడు. ఇక వారు వారందరి అంతర్గత విషయాలను తెలియజేశారు. దాంతో ఆ  షో మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది. అలా నటి కీర్తి కూడా ఎంతో ఎమోషనల్ అయ్యింది.

అలా ఆమెను యాంకర్ శ్రీముఖి అడగగా.. ఆమెకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, వారంతా కొన్ని సంవత్సరాల కిందట ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు అని తెలిపింది. కానీ నాకు ఆ బాధ ఇప్పుడు లేదని, ఎందుకంటే తను నటిస్తున్న సీరియల్లో తండ్రి గా నటిస్తున్న"చంద్రశేఖర్" తనను తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అని తెలిపింది కీర్తి.

ఇక ఈవిడే కాదు ఎంతో మంది మన సెలబ్రిటీలు తమ బంధువులను కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన వారినీ, తమకు పుట్టిన పిల్లల్లో చూసుకుంటూ ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. అలా కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు, మనము కూడా అలాగే చేస్తూ ఉంటాము. ఏదేమైనా వేగంగా వెళ్లడం ప్రమాదమని తెలిసినప్పటికీ మొనగాళ్ళు ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: