యాంకర్ లాస్య సంథింగ్ స్పెషల్ షో లో యాంకర్ గా చేస్తూ.. తనలో ఉండే సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.. ఆ తరువాత కాలక్రమేణా ఆమె బుల్లితెరకు దూరమైపోయింది. ఇక దాంతో తిరిగి బిగ్ బాస్-4 లో పాల్గొంది. ఇక అందులో తన మాటలతో, ఆటలతో బాగానే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసినా విజేతగా నిలువలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రాములలో మెరుస్తూ ఉంటుంది ఈమె. ఇక తాజాగా పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే షో లో కూడా తన భర్తతో కలసి సందడి చేయనుంది.


అయితే ఈ షో లో నే యాంకర్ లాస్య కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి తన తండ్రి అంగీకరించలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి సన్నివేశాన్ని రష్మి గౌతమ్ ఒక డ్యాన్స్ రూపంలో చేసి తెలియజేసింది. ఇక అంతే కాకుండా ఆ వీడియోలో రష్మీ  నాన్నా.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.. మీరు ఒప్పుకుంటే తనని వివాహం చేసుకుంటానని చెప్పుకొచ్చింది.. కానీ తన తండ్రి మాత్రం పరువు కోసం ప్రాణం ఇస్తాను కానీ.. ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ తెలియజేస్తారు.. ఈ పాత్రలో రాకెట్ రాఘవ నటించారు. ఇక ఆ తర్వాత ఐ యాం సారీ నాన్నా అని చెబుతూ.. రష్మీ అక్కడి నుంచి బయటికి వెళ్లి పోతుంది.. ఈ సన్నివేశాన్ని చూసిన లాస్య ఒక్కసారిగా కన్నీటి పర్వతం అయితుంది.


ఇక అప్పటి వరకు తన మనసులో ఉన్న ఒక విషయాన్ని తెలియజేసింది.. నేను కూడా రష్మీ  ఈ వీడియోలో ఎలా చేసిందో నా జీవితంలో కూడా అలాగే చేశానని చెప్పుకొచ్చింది. మనల్ని ప్రేమించిన వాళ్ళను బాధ పెట్టకూడదు.. కానీ అప్పుడు కళ్ళు మూసుకుపోవడం వల్ల ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే.. తన తండ్రి గుర్తుకు వచ్చినట్లు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: