జబర్దస్త్ షో గురించి అందులో ఉండే కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వీరంతా ఎక్కువగా ప్రేక్షకులను నవ్వించడానికి మాత్రమే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో మిమిక్రీ మూర్తి కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే ఈ కమెడియన్ పలు అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందడం జరిగింది. అయితే మిమిక్రీ మూర్తి ఆర్టిస్టుగా ఎవరు ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ అందుకున్నారు మూర్తి. అయితే జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యారని చెప్పవచ్చు.



కమెడియన్ కు ప్యాంక్రియా క్యాన్సర్ కారణంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఈ కమిడియన్.. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టా ఈ దీంతో మృతి చెందడం జరిగింది. మిమిక్రీ మూర్తి మరణ వార్త విన్న తెలుగు జబర్దస్త్ కమెడియన్ సైతం ఒక్కసారిగా శోకసముద్రంలోకి మునిగిపోయారు. అయితే ఈ విషయంపై అప్పారావు స్పష్టతనివ్వడం కూడా జరిగింది.ఆర్థిక సమస్యల వల్ల మిమిక్రీ మూర్తికి చికిత్స విషయంలో కాస్త ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని అందువల్లే మరణించాడు అని తెలియజేశారు.


అయితే ఆయనకి కొంతమంది స్నేహితులు ఆర్థికంగా సహాయం చేశారని రూ.16  లక్షల రూపాయల వరకు చికిత్స కోసం ఖర్చు చేసిన ఆ క్యాన్సర్ నుంచి కోలుకోలేక  మరణించారు మిమిక్రీ మూర్తి. అంతేకాకుండా ఆ క్యాన్సర్ కు ఉపయోగించే మందులు సైతం ఈ కమెడియన్ హెల్త్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఏన్నో సంవత్సరాల క్రితమే ఈ కమెడియన్ కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఈ కమెడియన్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో కొంతమంది మాత్రం ఈయన కుటుంబానికి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: