
మనదేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు, ఎలక్ట్రిక్ స్కూటర్ లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అయితే ఇంతకుముందు కేవలం రెండు కలర్ లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఓలా తాను రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ను దాదాపు 10 రంగులతో మనముందుకు తీసుకువచ్చింది. అది కూడా ఈనెలాఖరులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఓలా అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది..


ఇక ఈ స్కూటర్ ను పూర్తిగా మనం పూర్తీగా ఛార్జ్ చేసినట్లయితే, దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక 50 శాతం ఛార్జ్ చేసినప్పుడు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఆ సంస్థ తెలిపింది. ఏది ఏమైనా భారత మార్కెట్లో విడుదల చేసిన అత్యధిక శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ లలో, ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటిగా నిలవ బోతోంది.