ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం కొన్ని మొబైల్స్ గురించి తెలుసుకున్న తర్వాత వాటిని కచ్చితంగా కొనాలనిపిస్తూ ఉంటుంది.. ఈ రోజుల్లో దాదాపుగా అన్ని మొబైల్స్ కంపెనీలు కూడా బ్యాటరీ 7000 mah ఉండే విధంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఒక మొబైల్ బ్యాటరీ..23,800 mah సామర్థం కలిగిన బ్యాటరీ గా ఉన్నది.. ఈ మొబైల్ పేరు యునిహెర్ట్జ్ (unihertz) ఈ మొబైల్ చైనా బ్రాండెడ్ కు సంబంధించినది.. దీనిని ట్యాంక్-3 పేరుతో తీసుకురాబోతున్నారు.


గత ఏడాది నవంబర్ నెలలో ఈ బ్రాండ్ కు సంబంధించి ఒక మొబైల్ ని మార్కెట్లోకి విడుదల చేశారు..16 gb+512 GB స్టోరేజ్ కలిగిన వేరియన్స్ తో ప్రవేశపెట్టారు అలాగే ఎస్డి కార్డు ద్వారా కూడా స్టోరేజ్ ని పెంచుకోవచ్చు.. ఈ మొబైల్ ధర డాలర్ల విషయానికి వస్తే 499.99 కాగా చైనాలో 4,699 యువాండ్లు ఉండబోతోంది. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. మీడియా టెక్ డేమినిస్ట్రీ 8200 చిప్ సెట్టుతో కలదు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది..

6.79 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ ఫ్రీల కోసం 50 మెగా ఫిక్స్ఎల్ కెమెరా వెనుకవైపు 200 మెగాఫిక్సర్ కెమెరా కలదు. అలాగే 50 మెగా ఫిక్సల్ తో పాటు 64 మెగా ఫిక్సల్ నైట్ విజన్ షూట్ కెమెరా కూడా కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే 120 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కేవలం 90 నిమిషాలలో 90% వరకు చార్జింగ్ చేస్తుంది.. 75 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో పనిచేస్తుంది. దుమ్ము నీటి నుండి రక్షించడానికి ఈ మొబైల్ కు IP -68 రేటింగ్ తో కలదు ఈ మొబైల్ 40 మీటర్ల వరకు లేజర్ రేంజ్ ఫైండర్ ఇన్ ఫ్రారెడ్ సెన్సార్లు కూడా కలవు. ఫింగర్ ప్రింట్ సైడ్ బటన్ సెన్సార్లు వంటివి కూడా కలవు. ఇంకా మన ఇండియాలో ఈ మొబైల్ అమ్మకానికి రాలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: