గ్రహాంతరవాసుల గురించి అనేక సంవత్సరాలుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. భూమిని పోలిన గ్రహాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటప్పుడు మానవుల్లాంటి జీవులు మరోచోట ఉండొచ్చు కదా! అనే కుతూహలం నెలకుంది. ఇందు కోసం జరిగిన అన్వేషణలో అనేక విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్‌, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలను గుర్తించినా, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. అంతమాత్రాన గ్రహాంతరవాసుల ఉనికిని కొట్టిపారేయడానికి వీల్లేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతరిక్షంలోని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి, సౌర కుటుంబానికి వెలుపల ఉన్న మరికొన్ని గ్రహాలపై జీవుల ఉనికి గురించి రకరకాల ఊహాగానాలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిపై పలు కాల్పనిక సాహిత్యాలు రాగా.. కొన్ని సినిమాలూ ఉన్నాయి. గ్రహాంతర జీవుల గురించి అప్పడప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనకు సంబంధించిన కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. మనం నివసిస్తున్న భూమి మీద తప్ప మరెక్కడా తెలివైన మనుషుల్లాంటి జీవులు ఉండే అవకాశమే లేదంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కొన్నేళ్ల కిందట కొట్టిపారేసింది. ఆ వాదనకు భిన్నమైన కథనాలు ఇటీవల వెలువడుతుండటం విశేషం.


తాజాగా, గ్రహాంతర వాసుల గురించి ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 87 ఏళ్ల ఎషెడ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రజల్లోనే కలిసిపోయి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, అమెరికా, ఇజ్రాయెల్‌తో ఏలియన్స్ ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు. భూమిపై ప్రయోగాల నిర్వహణకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని తెలిపారు. మానవులు, అంతరిక్షజీవుల మధ్య ఒప్పంద వేదికగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఏర్పాటయ్యిందని, అంగారక గ్రహంలో ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా ఉందన్నారు. అందులో అమెరికన్ వ్యోమగాములు, ఏలియన్ ప్రతినిధులు ఉన్నారని హైమ్ ఎషెడ్ వెల్లడించారు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా తెలుసన్నారు. అయితే ఈ వివరాలను ఆయన బహిర్గతం చేయడానికి ఉబలాటపడిన సమయంలో గాలాక్టిక్ ఫెడరేషన్ నచ్చజెప్పిందని, దాంతో ఆయన వెనక్కి తగ్గారని ఎషెడ్ తెలిపారు.


అయితే, ఇదంతా వినడానికి ఓ కల్పిత గాథలా అనిపిస్తుందని, కానీ తాను చెప్పిన విషయాలు నిజమేనని స్పష్టం చేశారు. ఇవే విషయాలను తాను ఐదేళ్ల కిందట చెప్పి ఉంటే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేసేవాళ్లని అన్నారు. ఇప్పుడు తాను పనిచేస్తున్న విద్యాసంస్థలోనూ.. తనను మతి భ్రమించినవాడిలా చూశారని పేర్కొన్నారు. అయితే వీటికి సంబంధించిన వ్యవహారాల్లో తనకు డిగ్రీలు, అవార్డులు ఎన్నో వచ్చాయని, విదేశాల్లో సత్కారాలు పొందానని, ఈ విషయాలు వెల్లడించినందు వల్ల తాను నష్టపోయేదేమీ లేదని వ్యాఖ్యానించారు. హైమ్ ఎషెడ్ ఇజ్రాయెల్ స్సేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు మూడు దశాబ్దాల పాటు అధిపతిగా వ్యవహరించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రదానం చేసే సెక్యూరిటీ అవార్డును మూడుసార్లు అందుకున్నారు. భారత్‌-చైనా సరిహద్దుల్లోని కోంగ్కా లా పాస్‌ సముద్రమట్టానికి 16,970 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇరుదేశాలూ అక్కడ సైన్యాన్ని ఉంచకూడదని నిబంధన విధించుకున్నాయి. ఆ ప్రదేశంలో జీవించడం కష్టసాధ్యం కావడమే కారణమని పైకి చెబుతున్నప్పటికీ అసలు విషయం అది కాదనీ అక్కడ తరచూ ఫ్లయింగ్‌సాసర్లు కనిపిస్తుంటాయనీ చిత్రమైన ఆకారాలతో కూడిన మనుషులు సంచరిస్తుంటారనీ బహుశా వాళ్లంతా గ్రహాంతరవాసులై ఉండొచ్చనేది స్థానికుల అభిప్రాయంగా చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: