చూస్తుంటే ఈ రోజుల్లో అసలు చంద్రుడిపై కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగానే జరుగుతున్నట్లుంది. తాజాగా త్రిపురకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా చంద్రుడిపై రూ.6 వేలకు ఎకరా భూమిని కొనుగోలు చేశాడు.వామ్మో ఏంటి రూ.6 వేలకే ఎకరం భూమా.. అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది ముమ్మాటికి నిజమే. ఇంటర్నేషనల్ లూనార్ సొసైటీ అనే సంస్థకు ఆ డబ్బుని చెల్లించడం ద్వారా సుమన్ దేవ్‌నాథ్ అనే వ్యక్తి ఎకరా భూమిని కొనుగోలు చేసినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ ఒక కథనంలో వెల్లడించడం జరిగింది.6 వేలకే చంద్రుడిపై ఎకరా భూమి కొన్న ఘనుడు.ఇక చంద్రుడిపై భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తనకు మెయిల్ ద్వారా అందినట్లు సుమన్ దేవనాథ్ తెలిపడం జరిగింది. ఇందులో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ (ILLR) ఇంకా న్యూయార్క్ డాక్యుమెంట్ కూడా ఉన్నట్లు తెలిపడం జరిగింది. 


పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసినట్లు తెలిసి.. తనకు కూడా అక్కడ భూమి కొనుగోలు చేయాలనే ఆసక్తి కలిగిందన్నారు. చంద్రుడిపై కొనుగోలు చేసిన భూమిని తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకున్నట్లు ఆయన తెలిపారు.ఇక ఇందుకోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా ఆయనకు కొంత సమాచారం లభించిందన్నారు. ఆ సమాచారంతోనే ఐఐఎల్ఆర్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. చంద్రునిపైన అతను కొనుగోలు చేసిన ల్యాండ్ మేర్ నుబియం ప్రాంతంగా చెబుతున్నారు. కాగా, చంద్రుడిపై భూమి కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ స్టార్  ఎవరంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఇక ఆ తరువాత చంద్రుడిపై మేర్ ముస్కోవియన్స్ ప్రాంతంలో అతను భూమిని కొనుగోలు చేశాడు. అలాగే స్టార్ హీరో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కి కూడా చంద్రుడిపై భూమి ఉంది. గతంలో అతని అభిమాని ఒకరు షారుఖ్ ఖాన్ కి అది గిఫ్ట్‌గా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: