
అయితే ఏంటీ.. తర్వాత కొనుక్కునేవాళ్లు యాభై వేల ఒకటో బిర్యానీ కొనుక్కుంటారు.. ఏదైనా బిర్యానీనే కదా అని ఆమె మనసులో అనుకునేలోపే అసలు విషయం చెప్పారు..యాభై వేలవ బిర్యానీ కొనుగోలుదారుడికి ఏడాది పాటు ఉచిత బిర్యానీని ఆఫర్ చేస్తున్నామని.. అందులో మీరే విజేతగా నిలిచారని చెప్పేశారు. దాంతో రక్షిత రెడ్డి ఉక్కిరిబిక్కిరయిపోయింది. వెంటనే ఆమెతో కేక్ కట్ చేయించి.. ఆఫర్ కూపన్లు చేతిలో పెట్టారు. ఏడాది మొత్తం తినొచ్చు కదా అని రోజు వచ్చి తింటారని అనుకున్నారేమో కొన్ని రూల్స్ పెట్టారు.ఏడాది పాటు తినొచ్చు..కానీ నెలకు ఒక్క సారే. అంటే పన్నెండు బిర్యానీలు ఫ్రీ అన్నమాట..
దిల్సే థాంక్యూ' ప్రచారంలో భాగంగా తమ వినియోగదారులకు సేవలనందించాలనే బ్రాండ్ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా 3.5 మిలియన్ల మంది లాయల్ ప్యారడైజ్ సర్కిల్ సభ్యులకు సేవలనందిస్తామని ప్యారడైజ్ ఓనర్లు చెబుతున్నారు. బిర్యానీ ప్రేమికులంతా కూడా ప్యారడైజ్ సర్కిల్లో చేరడంతో పాటుగా ఉచిత బిర్యానీ పొందాలని యజమానాలు అంటున్నారు. ఉచిత బిర్యానీలతో పాటుగా , ప్రతి 100 రూపాయల విలువ కలిగిన కొనుగోళ్లపై రెండు జెమ్స్ను ప్యారడైజ్ సర్కిల్ ద్వారా పొందవచ్చునని ఈ జెమ్స్ను రివార్డ్స్ పాయింట్స్గా పంపిణీ చేస్తామని చెప్పారు..ఎప్పుడైనా రెడీమ్ చేసుకోవచ్చనని అన్నారు.మొత్తానికి ఈ ఆఫర్ తో ఆమె ఫుల్ ఖుషి అయ్యింది.