పెళ్లంటే అట్టహాసం, ఆర్భాటం ఉండాలి అని అనుకునేవారు ఒకప్పుడు. ఇక ఇప్పుడు కూడా ఇలాగే అనుకుంటున్నారు. పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ఏకంగా సామాన్య ప్రజల సైతం తాహతకు మించి పెళ్లి కోసం ఖర్చు పెడుతూ ఉండడం చూస్తూ ఉన్నాము అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పెళ్లి అంటే కేవలం అట్టహాసం ఆర్భాటం మాత్రమే కాదండోయ్ ఇక పెళ్లిలో ఏది చేసినా కాస్త వినూత్నంగా ఉండేలా ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు అని చెప్పాలి. అందరిలా పెళ్లి చేసుకుంటే అందులో కిక్ ఏముంటుంది.. ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తేనే కదా జీవితాంతం గుర్తుంటుంది అని అనుకుంటున్నారు అందరూ.


 ఈ క్రమంలోనే పెళ్లిలను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా  వధువునూ బుట్టలో కూర్చో పెట్టి ఆమె కుటుంబ సభ్యులు ఆ బుట్టని ఎత్తుకొని పెళ్లి మండపంలోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక ఈ ట్రెండ్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి  వధూవరులు పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా భారీగా ఖర్చులు పెట్టుకుంటూన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి.


 ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఉపేస్తూ ఉంది. ఏకంగా వివాహ వేడుకలో తండ్రితో కలిసి పెళ్లికూతురు ఎంట్రీ ఇచ్చిన తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో సీలింగ్ నుంచి కదిలే ప్లాట్ ఫాంపై టాప్ నుంచి తండ్రితో కలిసి పెళ్లికూతురు ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ గ్రాండ్ ఎంట్రీ చూసి పెళ్లిలో ఉన్న వారందరూ కూడా వీడియో తీయడం మొదలు పెట్టారు అని చెప్పాలి. ఇక మరోవైపు ఈ వీడియో పై నెగిటివ్గా కూడా కొంతమంది స్పందిస్తున్నారు. వినూత్నంగా ఎంట్రీ ఇచ్చే తాపత్రయంతో కాస్త రిస్క్ చేశారని ఏదైనా అటు ఇటు అయితే చివరికి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని కొంతమంది నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. పాకిస్తాన్లో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: