విజ్ఞానాలను తొలగించే విగ్నేశ్వరుడి జన్మదినానే వినాయక చవితిగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ప్రజలు.. ప్రతి ఏడాది కూడా భాద్రప్రద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. వినాయక చవితికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది.. ఆది దంపతులైన శివ-పార్వతుల మొదటి కుమారుడే గణపతి.. గణపతిని పూజించనిదే ఏ పని కూడా ఎవరు ప్రారంభించరు. వినాయకుడిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


విజ్ఞేశ్వరుడు అంటేన విజ్ఞములను తొలగించేవారని అర్థము.. అంటే ఆటంకాల నుంచి రక్షణ పొందాలి అంటే దుష్ట దోషములు పోవాలి అన్న విద్య బుద్ధి, వ్యాపార అభివృద్ధి మోక్షం లభించాలన్న విగ్నేశ్వరుడి అనుగ్రహం కచ్చితంగా ఉండాలని పురాణాలు సైతం తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే వినాయకుడిని కచ్చితంగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు.. వినాయక పూజకు కావలసిన సామాగ్రిలలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు ,గంధం ,అరటి పండ్లు, కొబ్బరికాయలు, నెయ్యి, నూనె ఇరవై ఒక్క రకాల పత్రి, ఉద్దరిని, ఎలక్కాయలు, నైవేద్యాలు వంటివి పెట్టి వినాయకుడిని పూజించాలి.

ఇక పూజ ఎలా చేయాలనే విషయానికి వస్తే వినాయక చవితి రోజున కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి.. వినాయక చవితి రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని పూజ గదిని శుభ్రపరచిన తర్వాత తల స్నానము చేయాలి.. కొత్త బట్టలు ధరించి పూజ మందిరాన్ని పసుపు కుంకుమల తోరణాలతో అలంకరించాలి ఆ తర్వాత విజ్ఞేశ్వరుడిని పెద్ద అలంకరణతో కుటుంబం అంతా కలిసి కూర్చొని పూజ మందిరంలో తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచాలి.


ఆ తర్వాత ఒక ప్లేట్లు బియ్యం వేసి వాటిపైన తమలపాకు పెట్టి అగరవత్తులు ఉంచి దీపారాధన చేయాలి. వినాయక శ్లోకం చదువుతూ పూజించడం వల్ల జయం కలుగుతుందట. ఏదైనా పీఠపైన వినాయక ప్రతిమను ఉంచాలి. వినాయక బొమ్మకు పసుపు కుంకుమరాశి బొట్టు పెట్టి పెట్టి పూలమాలను వేయాలి. అలాగే మొక్కజొన్న ఒత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం తదితర వంటి పిండి వంటకాలు వినాయక ముందు పెట్టాలి. ఇలా వినాయకుడు పండుగ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: