విరసం నేత వరవరరావుని  విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మహారాష్ట్ర జైల్లో ఉండటం ఆయనకు కరోనా రావడంతో చాలా వరకు ఆయన అభిమానులు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిల ఉంటే ఇప్పుడు ఆయనను విడుదల చేయాలని ఏపీలో అధికార పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేయడం గమనార్హం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక లేఖ రాసారు.

దీనిపై బిజెపి మండిపడుతుంది. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఇప్పుడు ఒక ట్వీట్ చేసారు. “జగన్ రెడ్డి గారూ దేశ ప్రధాన మంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా? తక్షణమే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: