అతడు రాసిన సూసైడ్ లేఖలో
"సర్వే టైంలో కొన్ని మెజర్మెంట్ టైప్స్, రిజిస్టర్లు కొన్నాను. దానికి సంబంధించి రూ.4200 ఖర్చయ్యింది. ఇక 2019-20 సంవత్సరానికి దాదాపుగా రూ.22 వేలు ఖర్చు చేశాను. కానీ వీటికి సంబంధించి ఏ ఒక్క రూపాయి చెక్ కూడా తీసుకోలేదు. డబ్బులు అడిగితే చెక్కులపై సంతకం చేయమని చెప్పారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీకి ఖర్చు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే నేను చెప్పేవన్నీ చనిపోయేంత పెద్ద కారణాలు కాదని నాకు తెలుసు.
కానీ గ్రామ పంచాయతీ ఆఫీసులో కనీస మర్యాద కూడా దక్కడం లేదు. కొంత మందికి మద్యం పోయించి మరి నాతో గొడవ పెట్టుకోమని నా దగ్గరకు పంపిస్తున్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాగే జరుగుతుండటంతో.. నా వల్ల కావడం లేదు. నాకు బతుకు మీద విరక్తి కలుగుతున్నప్పటికి..బతకాలని ఉన్న చావే నాకు దిక్కు " అని లెటర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ అందరితోనూ కంటతడి పెట్టిస్తుంది.