కరోనా పూర్తి కుటుంబాలను తుడిచిపెట్టుకుపోతోంది. తండ్రి ని ప్రమాదం మింగేయ్యగా ఇప్పుడు కరోనా తల్లిని కూడా తీసుకెళ్ళిపోయింది. చివరికి ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారు అనాథలు అయ్యారు. తిరునల్వేలి జిల్లా ముడించి పట్టి గ్రామం ఈ సంఘటన తీవ్ర విషాదంలో మునిగింది. ముడించిపట్టి తుత్తికులానికి చెందిన జప మాణిక్య రాజ్, జ్ఞానమరియ సెల్వి దంపతులకు ముగ్గురు బాలురు. భర్త చనిపోవడంతో సెల్వి అంగన్‌వాడీలో  పని చేస్తూ పిల్లలను సాకుతూ వస్తుంది. కానీ కరోనా ఆమెను మింగేసింది. దిక్కు తోచని స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: