ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్. న్యూజిలాండ్ అప్పుడు పక్కా బౌలింగ్ లైనప్ తో బరిలోకి దిగితే ఇండియా మాత్రం స్పిన్నర్ల మీద ఆధారపడింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో మొదలైన ఫస్ట్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు.

ఏకంగా నలుగురు పేసర్లను బరిలోకి దించాడు కోహ్లీ. సీనియర్ పేసర్ గా శమి బౌలింగ్ టీం కి నాయకత్వం వహిస్తుండగా యువ బౌలర్లు జస్ప్రిట్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ని బరిలోకి దించాడు. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉన్నాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు ఏ విధంగా వాడుకుంటారు అనేది కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: