ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఘటన జరిగిన తర్వాత కేంద్ర హోం మంత్రికి ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనను నేరుగా కలవడానికి ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. శనివారం ఢిల్లీకి చంద్రబాబు నాయుడు తో పాటుగా పలువురు టీడీపీ నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలువనున్న చంద్రబాబు, టీడీపీ  నేతలు... దాడికి సంబంధించిన వీడియో లను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడులు,రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన వివరించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో రేపు చంద్రబాబు నాయుడు దీక్షకు దిగుతారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయన దీక్ష చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: