చిన బాబు లోకేశ్ సీన్ లోకి వ‌చ్చారు.వైసీపీ ని టార్గెట్ చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న త‌ల్లిని ఉద్దేశించి కించ‌ప‌రిచే ధోర‌ణిలో వ్యాఖ్య‌లు చేసిన ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌బోన‌ని అన్నారు. ఈ మేర‌కు నారా లోకేశ్ శ‌ప‌థం చేశారు.ఈ మేర‌కు అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేశ్..తాను రాజ‌కీయాల్లోకి రాక మునుపు నుంచి త‌న‌ను టార్గెట్ చేశార‌ని, వివేకా హ‌త్య త‌రువాత త‌న తండ్రిని సాక్షి లో టార్గెట్ చేశార‌ని ఆవేద‌న చెందారు. ఈ నేప‌థ్యంలోలోకేశ్ ను సాక్షి మీడియా మ‌రోసారి టార్గెట్ చేస్తుంద‌ని ఇదే విధంగా మాట్లాడితే మ‌ళ్లీ పాత క‌థ‌నాలు అన్నీ త‌వ్వి రీ ప్లే చేస్తామ‌ని వైసీపీ అంటోంది.

త‌ల్లినీ చెల్లినీ ఎందుకు ఉద్దేశించి మాట్లాడతారు,తాము కూడా అలా మాట్లాడితే మీరేమ‌యిపోతారు అన్న‌ది లోకేశ్ ప్ర‌శ్న. విజ‌య‌మ్మ‌ను కానీ ష‌ర్మిల‌ను కానీ తాము ఏనాడయినా అలా అన్నామా అని ప్ర‌శ్నించారు లోకేశ్. చాలా రోజుల త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చి పాత త‌గాదాలు త‌వ్వి సెంటిమెంట్ రాజ‌కీయాల‌కు తెర‌లేప‌డం ఒక్క లోకేశ్ కే సాధ్యం అని వైసీపీ కౌంట‌ర్లు ఇస్తోంది.ఇదే సంద‌ర్భంలో సాక్షి త‌న‌పై బుర‌ద జ‌ల్లింద‌ని కోర్టుకు పోతాన‌ని త‌ప్పుడు వార్త‌లు రాస్తే ఒప్పుకోన‌ని లోకేశ్ అంటున్నార‌ని, అయితే తాము కూడా ఈనాడు ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్ల‌పై ప్ర‌తిరోజూ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని వైసీపీ అంటోంది.ఇప్ప‌టికే తమ త‌ర‌ఫున రాష్ట్ర ఉన్న‌తాధికారి నాగులాప‌ల్లి శ్రీ‌కాంత్ నోటీసులు ఆ రెండు పేప‌ర్ల‌కూ ఇచ్చార‌ని గుర్తు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు.ఇదేవిధంగా లోకేశ్ మాట్లాడితే త‌మ కౌంట‌ర్లు కూడా న్యాయ స్థానంలోనే దాఖ‌లు చేయాల్సి వ‌స్తుంద‌ని వైసీపీ హెచ్చ‌రిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

tdp