ఇవాళ చంద్రబాబు 73వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన.. ఇవాళ్టి నుంచి ఇక జనం మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ పుట్టిన రోజు కూడా జనం మధ్య జరుపుకోబోతున్నారు. ఈ ఉదయం  విజయవాడ కనకదుర అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో  నాయకులు, కార్యకర్తల్ని కలుస్తారు. ఈ సాయంత్రం చంద్రబాబు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలం గొల్లగూడెంలో పర్యటిస్తారు. అక్కడి గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. ఈ గ్రామంలో చంద్రబాబు గ్రామసభ నిర్వహిస్తారు. స్థానికులతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేస్తారు. ఇలా పుట్టిన రోజును జనం మధ్య చంద్రబాబు గడపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: