ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కే ఏ పాల్‌  తెలుగు ప్రజలకు హానిచేసే చీడపురుగు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కే.ఏ పాల్ మత ప్రబోధకుడా? రాజకీయ నాయకుడో తేల్చుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాదు..  కె.ఏ.పాల్ మానసిక స్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


కే ఏ పాల్‌ను తక్షణమే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించాలని కాంగ్రెస్ నేత బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.  భవిష్యత్తులో మరోసారి మహిళలనుగానీ, కాంగ్రెస్ పార్టీనిగానీ కించపరిచే విధంగా మాట్లాడితే.. కే.ఏ.పాల్ ను తెలంగాణ నుంచి తరిమికొడతామని బండి సుధాకర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.  సోనియా గాంధీ ఇండియాలో అవినీతిని పెంపొందింపజేసి, అస్థిర పరిచేందుకు కుట్ర పన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్‌ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించడమే ఇందుకు కారణం.


మరింత సమాచారం తెలుసుకోండి: