తిరుపతి వెంకన్నును ఆపద మొక్కులవాడు అంటుంటారు. ఆయన్ను మొక్కుకుంటే తీరని కోరిక ఉండని భక్తుల నమ్మకం. అందుకే ఆ వెంకన్నకు భక్తులు కూడా కానుకలు జాస్తిగానే సమర్పించుకుంటారు. తాజాగా నిన్న ఒక్కరోజే తిరుపతి వెంకన్నకు ఏకంగా 10 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇంతకీ ఎవరిచ్చారంటారా?


తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల్ బాలకృష్ణన్ అనే భక్తుడు స్వామివారికి రూ. 7 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఈ ఏడు కోట్ల రూపాయలను టీటీడీ నిర్వహిస్తున్న అన్నదానం సహా ఏడు ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. మరో సంస్థ బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ శ్రీవాణి ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం ఇచ్చింది.  సీ హబ్ ఇన్స్ పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ వేద పరిరక్షణ కోటి రూపాయల విరాళంగా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: