ప్రధానమంత్రి మోదీ సభను చరిత్రలో నిలిచి పోయేలా నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. సభకు సుమారు 10లక్షల మంది జనసమీకరణ చేస్తున్నామని బండి సంజయ్‌ తెలిపారు. సభ విజయవంతం కోసం బూతు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జన సమీకరణ కోసం కమిటీలు వేశామని బండి సంజయ్‌ తెలిపారు. జూలై 3వ తేదీన పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే భారీ బహిరంగసభ పనులను బండి సంజయ్‌ పర్యవేక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం బీజేపీ పనిచేస్తుందని...ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని  సంజయ్‌ అన్నారు. బీజేపీని కట్టడి చేయాలని ఇబ్బంది పెట్టాలని సీఎంఓ కార్యాలయంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారని బండి సంజయ్‌ అన్నారు. అయినప్పటికీ ఏం చేయలేకపోయారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. సీఎంను ప్రజలే పట్టించుకోవడంలేదని...బీజేపీ కూడా పట్టించుకోదని బండి సంజయ్‌ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: