జనసేనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర‌్లు వేశారు. అసలు జనసేన ఒక రాజకీయ పార్టీయే కాదన్నారు. జనసేనసినిమా పార్టీ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మేము జనసేను పార్టీగానే చూడమని.. ఆ పార్టీలో ఎవరున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తప్ప ఆ పార్టీలో నేతలు ఏరని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.


నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. చంద్రబాబును కలిసిన వారే కలుస్తారు... మోడీని కలిసిన వాళ్లే కలుస్తారు.. ఋషికొండకు చిలకా గోరింకలా వెళ్లారు.. బీచ్ లో నడుస్తూ నడుస్తూ ఆ ప్రేమ పావురాలు ఋషికొండను చూశాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మోడీ సభ బ్రహ్మాండంగా జరిగిందని.. దేశవ్యాప్తంగా వచ్చే పేరును పక్కదారి పట్టించడం కోసం పవన్, మనోహర్  ఈ రుషికొండ సందర్శన చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎప్పటికైనా జనసేన పార్టీని బంగాళాఖాతంలో కలిపేసేది నాదెండ్ల మనోహరేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: