కాంగ్రెస్ పార్టీ లో జంబో కమిటీ తో తలెత్తిన విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ కార్యక్రమాలకు హాజరు కాకూడదని అసంతృప్తులుగా ఉన్న సీనియర్లు తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారు. తమను అధిష్టానం పిలిపించి మాట్లాడుతుందని సీనియర్లు భావిస్తున్నారు. అసంతృప్తిల నేతలు నిన్న మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలనుపీసీసీ, ఏఐసీసీలు నిశితంగా పరిశీలిస్తున్నాయట.
 

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికీ ఎక్కువ పదవులు ఇచ్చినట్లు అసంతృప్త సీనియర్లు  ఆరోపించారు. అయితే.. ఇందుకు కౌంటర్ గ జంబో జాబితాలోని పార్టీల నుంచి వచ్చిన వివరాలతో కూడిన జాబితాను  ఏఐసీసీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సామజిక వర్గాలవారీగా కూడా జాబితా సిద్ధం చేసిన ఏఐసీసీ... సాయంత్రం పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది. అయితే.. ఈ సమావేశానికి హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నారు. మొత్తానికి సీనియర్లు రేవంత్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారుగా..!


మరింత సమాచారం తెలుసుకోండి: