ముఖ గుర్తింపు ఆధారంతో హాజరు వేసే పద్ధతి నుండి  మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఈ మేరకు యాజమాన్యాన్ని  ప్రధాన ఉద్యోగ సంఘం ఎంప్లాయిస్ యూనియన్  కోరింది. యూనియన్ నేతలు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు ఇటీవల లేఖ రాశారు. ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల ఆర్టీసీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆర్టిసీ ఉద్యోగులు విధులు 24గంటలపాటు  అంకిత భావంతో పనిచేస్తూంటారు. ఆర్టిసీ ఉద్యోగులు రోజుకు 8 గంటల కంటే అదనంగా పనిచేసే పరిస్ధితులున్నాయి. పదినిముషాలు ఆలస్యంగా వస్తే గైర్హాజరుగా పరిగణించడం,  పనిగంటలు నిర్ణయించడం సరైంది కాదు.


ఆర్టీసీలో  చాలామంది ఆర్టీసి సిబ్బంది వద్ద ఆండ్రాయిడ్  పోన్లు లేవు. ఉన్నవారిలో కూడా కొంతమందికి ఇలాంటి టెక్నాలజీ ఎలా వినియోగించాలో తెలియని పరిస్దితి ఉంది. అందుకే ముఖ గుర్తింపు హాజరు ఇబ్బందులపై చర్చించేందుకు సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ముఖగుర్తింపు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చించాలని ఎండీని కార్మిక నేతలు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: