గ్యాస్​ ఏజెన్సీ మేనేజర్​తో డబ్బు విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల ఓ సప్లయర్​.. 61 ఎల్​పీజీ సిలిండర్లతో పరారైన ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ వ్యవహారాన్ని మాల్వియా నగర్​ పోలీస్​ స్టేషన్​లో మేనేజర్​ ఫిర్యాదు చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితుడు గోవింద్​ సింగ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.నిఘా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సింగ్​ ఎక్కడున్నాడన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు.

 దొంగలించిన సిలిండర్లను ఖాన్​పుర్​ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.అయితే.. మేనేజర్​తో లావాదేవీల వ్యవహారంలో విభేదాలు ఉండటం వల్లే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: