తెలంగాణ మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పుణ్యక్షేత్రం విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతోంది. ఇటీవల యాదాద్రి పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా వందల సంఖ్యలో విద్యుత్ దీపాలను అమర్చారు. రాత్రిపూట కాంతులు విరజిమ్మేలా వందలాది విద్యుత్‌ దీపాలను బిగించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 

గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా రాష్ట్రానికి అద్భుతమైన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మిస్తున్నారు. అలా ఈ ఆలయం భారతదేశం అంతటా భక్తులకు అద్భుతమైన మరో ఆభారణంలా తోడయ్యింది.  ఆలయానికి సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలు త్వరలోనే ఆవిష్కరించనున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: