ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రకు తీవ్ర అవమానం జరిగినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో భాగంగా ఆయనను కలిసేందుకు వెళ్లిన మంత్రికి అవమానం జరిగినట్లు సమాచారం అందుతోంది. తిరుపతి విమానాశ్రయంలోని వీఐపీ గేటు లోపలకు మంత్రిని రానీయకుండా కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలోనే పీయూష్ గోయల్ కు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వీడ్కోలు కూడా పలకలేక పోయారని అంటున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి బుగ్గన విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. అయితే తనను అడ్డుకున్న వారి వివరాలు ఇవ్వాలని బుగ్గన కోరగా విమానాశ్రయ అధికారులు రంగంలోకి దిగి మంత్రికి సర్దిచెప్పి, శాంతింపజేసి అక్కడినుంచి పంపించినట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: