అదేం విచిత్రమో తెలియదు కానీ కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో కూడా ఎక్కడా మాస్క్ పెట్టుకుని కనిపించిన దాఖలాలు లేవు. రివ్యూ మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ స్ లో సైతం ఆయన మాస్క్ లేకుండా కనిపించేవారు. ఈ విషయం మీద ప్రతిపక్షాల వారు ఎంత కామెంట్లు చేసినా ఆయన వినిపించుకున్న పాపాన పోలేదు. ఏకంగా కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన మాస్క్ పెట్టుకోలేదని, కేంద్ర మంత్రులు బలవంతం చేయడంతోనే మాస్క్ పెట్టుకున్నారని కూడా టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. అలాంటి జగన్ ఈ రోజు స్వయంగా మాస్కులు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇలా ఎందుకు పెట్టుకున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోయినప్పటికీ వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: