
చాలా కాలం తర్వాత ఈ రోజు మళ్ళీ తెలుగు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయి. దాదాపు ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నా రెండు సినిమాలకు మాత్రం విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, తేజసజ్జా నటించిన ఇష్క్ సినిమాల మీద జనం ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ సినిమాల రిలీజ్ సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రివ్యూ రైటర్ స్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాన్ని థియేటర్ కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు, సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఆయన సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమాలో కీలక పాత్రలో నటించారు.