బండి సంజయ్ సీఎంకు రాసిన లేఖ తీరును ఖండిస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. సంజయ్ యాత్రకు స్పందన లేక బెకార్ మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. బురదలో బోర్లే పందికి పన్నీరు వాసన తెలీదు అన్నట్లు సంజయ్ చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బడాజూట బండి సంజయ్ కి ప్రగతి భవన్ ప్రాధాన్యత తెలీదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 ప్రజలకు అందిస్తున్న పథకాలకు పురుడు పోసిన భవన్ ప్రగతి భవన్ అని... కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది అని స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలు బికారులు అన్న మాటలు సంజయ్ వెనక్కి తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నారు. మొన్ననే వినాయక నిమజ్జనం ముగిసింది... ఇక ప్రతిపక్షాల నిమర్జనం మిగిలివుంది అని త్వరలోనే చేస్తాం అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs