తెలుగుదేశం పార్టీపై మ‌రొక‌సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. తాజాగా జ‌నాగ్ర‌హ‌దీక్ష‌లో పాల్గొని ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  అభివృద్ధి సంక్షేమాల‌ను చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నారు.   లోకేశ్ అస‌భ్య‌క‌ర‌మైన ట్విట్లు చేస్తున్నారు. లోకేశ్ ను స‌న్మార్గంలో పెట్టాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపైనే ఉంద‌న్నారు.  

తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈవిధంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తుందంటే.. అసెంబ్లీ స్థానాలు, పార్ల‌మెంట్ స్థానాలు, అన్ని  జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయ‌తీ స్థానాల‌ను వైఎస్సార్‌సీపీ కైవ‌సం చేసుకున్న‌ది. అందుకే చంద్ర‌బాబు అస‌హ‌నంతో ఉన్నారు. టీడీపీ వెంటిలెట‌ర్ పై ఉన్న పార్టీ.. అని పేర్కొన్నారు. పార్టీనేత‌ల‌తో బూతులు మాట్లాడించి.. దీనికి సాకుల‌తో దీక్ష‌లు చేస్తూ రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నార‌ని ఫైర్ అయ్యారు ఎంపీ. వైసీపీ పాల‌న‌లో  రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వ‌లేక‌నే చంద్ర‌బాబు ఇలాంటివాటికి పాల్ప‌డుతున్నాడ‌ని మండిప‌డ్డారు.  టీడీపీ హ‌యాంలో పాల‌న ఏవిధంగా ఉంద‌నేది ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: