ప్రతిరోజూ మనం ఇన్సూరెన్స్ అనే పేరు వింటూనే ఉన్నప్పటికీ దీని గురించి పూర్తి అవగాహన ఉండేవారు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటారు. దేశంలో అధిక సంఖ్యలో ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా పాలసీలు తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. లైఫ్, యాక్సిడెంట్, హెల్త్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే మొదట మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పేరు గుర్తొస్తుంది. 
 
దేశంలో అతి పెద్ద బీమా సంస్థగా ఎల్ఐసీకు గుర్తింపు ఉంది. మనం ఎల్ఐసీ ద్వారా 30,000 రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ డబ్బులు పొందవచ్చు. ఈ బీమా కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి 30,000 రూపాయల వరకు ఉచిత జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ బీమా అన్ని బ్యాంక్ అకౌంట్లకు వర్తించదు. కేవలం జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. 
 
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. పాలసీదారుడు చనిపోతే నామినీకి బీమా డబ్బులు అందుతాయి. గతంలో జన్ ధన్ యోజన అకౌంట్లు ఓపెన్ చేసిన వారు మాత్రమే ఈ బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. 2014 ఆగస్ట్ 15 నుండి 2015 జనవరి 26లోపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు రూపే కార్డు ఉన్నవారికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. జన్ ధన్ అకౌంట్ తెరిచిన వారు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఖాతాదారుడు ఎలా మరణించినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: