ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు గాను bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమెరికా ఫెడరల్ రిజర్వ్ లాగా చర్యలు తీసుకుంటోంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సెంట్రల్ బ్యాంకులు రెపో రేట్లను ఎప్పుడూ కూడా పెంచుతున్నాయి.కాబట్టి దాన్ని అనుసరించి డిసెంబర్ 7వ తేదీన రెపో రేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించవచ్చు.ద్రవ్యోల్బణంని తగ్గించేందుకు ఆర్‌బీఐ గతంలో కూడా పలుమార్లు రెపో రేటును పెంచడం జరిగింది. మే నెల నుండి ఇప్పటి వరకు కూడా వడ్డీ అనేది సుమారు 2 శాతం పెరిగింది.ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం డిసెంబర్ 5 వ తేదీ సోమవారం నుంచి కూడా ప్రారంభం కానుంది.ఈ ఆర్‌బీఐ ఇంకోసారి రెపో రేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ద్రవ్యోల్బణంని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టడం అయితే జరిగింది. ఈమధ్య కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.ఈసారి రెపో రేటును 0.25 నుంచి 0.35 శాతం దాకా కూడా పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


డిసెంబర్ 7 వ తేదీన ఆర్‌బీఐ సమావేశం ముగియనుందని, ఇక ఆ తర్వాత రెపో రేటు పెంపునకు సంబంధించి ప్రకటన కూడా వెలువడవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఈసారి కూడా ఎంపీసీ రేట్లను పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపడం జరిగింది. అయితే ఈ పెరుగుదల 0.25 నుండి 0.35 శాతం దాకా కూడా ఉండవచ్చు. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 6.5 శాతానికి చేరుకుంటుందని, అంటే ఫిబ్రవరి నెలలో మరోసారి రెపో రేటు పెరగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.ఇంకా అలాగే ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ డీకే పంత్ తెలిపడం జరిగింది. అయితే ఈ త్రైమాసికంలో ఇది మొత్తం ఆరు శాతానికి పైనే ఉంటుంది. అందువల్ల డిసెంబర్ 2022లో ఆర్‌బిఐ ద్రవ్య విధానాన్ని మొత్తం 0.25 శాతం పెంచగలదని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI