భార్య భర్తల బంధం అంటే ఎంత అన్యోన్యంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడుముళ్ల బంధంలోకి ఒకసారి  అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల్లో ఇలాంటి ప్రేమ అభిమానం ఎక్కడా కనిపించడం లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్య భర్తల మధ్య గొడవలు జరగడం తప్ప అర్థం చేసుకునే గుణం మాత్రం కనిపించడం లేదు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో భార్య భర్తలు తరచూ గొడవ పడుతూ బద్ద శత్రువులు గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 అదే సమయంలో ఏకంగా భార్యాభర్తల బంధానికి విలువ ఇవ్వని ఎంతోమంది ఏకంగా ఆస్తులకోసం కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటనలు కూడా సంచలనంగా మారిపోతున్నాయి. దీంతో సొంత వారి నుంచి ప్రాణహాని తలెత్తుతూ ఉండడంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తన పసుపు కుంకాలు కంటే ఆస్తులు ఎక్కువ అని భావించింది ఆ మహిళ. ఈ క్రమంలోనే భర్త పేరు మీద ఉన్న ఆస్తులు సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కోసం చిన్న కుమారుడితో కలిసి ప్లాన్ వేసింది సదరు మహిళ. ఏకంగా కట్టుకున్న భర్త పైనే దారుణంగా దాడి చేసింది.


 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింత గడ్డ తండా గ్రామపంచాయతీ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో రూప్సింగ్ తండాకు చెందిన గుగులోతు కోటియా నివసిస్తున్నారు  వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు ఈయన. అయితే ఈయన పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. భర్త పేరు మీద ఉన్న మూడు ఎకరాల భూమిని తన పేరుమీద కి మార్చు కోవాలి అని భావించింది భార్య. ఇక దీని కోసం భర్తను అడిగితే భర్త మాత్రం నిరాకరించాడు. ఇక ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ గుగులోతు కోటియా ఒప్పుకోకపోవడంతో చివరికి చిన్న కుమారుడు తో ప్లాన్ వేసి భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేసింది. నా చిన్న కుమారుడు తో కలిసి కత్తితో దాడి చేసి భర్త చెవులు కోసేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: