ఇటీవలికాలంలో మూడు ముళ్ల బంధానికి ఎక్కడ విలువ ఇవ్వడం లేదు నేటి రోజుల్లో జనాలు. ఎందుకంటే కట్టుకున్న బంధాన్ని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి శతకల సుఖం కోసం చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఇలా అక్రమ సంబంధాలు నేటి రోజుల్లో ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి అని చెప్పాలి. అంతేకాకుండా కట్టుకున్న బంధానికి  విలువ ఇవ్వకుండా ఏకంగా ప్రియుడి కోసం నేరాలకు పాల్పడేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని ఇడుక్కి జిల్లా కు చెందిన ఒక మహిళ తన భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి చివరికి సీన్ రివర్స్ కావడంతో జైలుపాలు అయింది.


 ఆమెతోపాటు ఆమెకు సహాయం చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. సౌదీ అరేబియా లో నివసిస్తున్న ఆమె ప్రేమికుడిపై ఇక కుట్ర ఆరోపణలు కూడా నమోదు చేయడం గమనార్హం. 33 ఏళ్ల సౌమ్యా అబ్రహం ఇడుక్కి జిల్లాలోని  గ్రామ పంచాయతీలో భర్తతో కలిసి నటిస్తోంది. ఇక ఇటీవలే శంషాబ్ భాష  సహా మరో వ్యక్తితో  కలిసి భర్త సునీల్ ను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని ప్లాన్ చేసింది.  కానీ సదరు మహిళ వేసుకున్న ప్లాన్ కాస్త చివరికి బెడిసికొట్టింది. భర్తను ఇరికించాలనుకున్న భార్య చివరికి అరెస్ట్ అయి జైలు పాలయ్యింది.


  భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించి ఇక ఆ తర్వాత భర్త జైలుకు వెళ్ళగానే ప్రియుడితో హాయిగా గడపొచ్చు అని ప్లాన్ చేసింది భార్య. ఈ క్రమంలోనే భర్త వాహనంలో డ్రగ్స్  పెట్టడానికి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి నార్కోటిక్స్  యాక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందడంతో ఇక  సునీల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని చెక్ చేయగా డ్రగ్స్ గుర్తించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరపడం తో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి అనే చెప్పాలి. చివరికి భార్య అసలు సూత్రధారి అని తెలుసుకుని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: