నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. ఇక ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ లోనే దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఇక ఆన్లైన్ మెసేజ్ ల ద్వారానే చాటింగ్ లు మీటింగ్ లు డేటింగ్ లు అన్నీ జరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక వాట్సాప్ వినియోగం కూడా ఎంతగానో పెరిగిపోయింది. అయితే ఇలా టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అంతా బాగానే ఉంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ లో చాటింగ్ ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నారు. ఇక ఇలా స్మార్ట్ ఫోన్ ఎంతోమంది పై అనుమానం పెంచుకునేలా చేస్తూ చివరకు దారుణాలకు కారణమవుతుంది.



 ఇటీవల ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముత్యం పేట గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత కొన్ని రోజుల నుంచి మరో వివాహితుడు ప్రశాంత్ అనే వ్యక్తి తో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. కొన్నాళ్ల వరకూ భర్తకు తెలియకుండా ఇలా చాటింగ్ చేస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ విషయం భర్తకు తెలిసింది. తెలియని వ్యక్తి తో చాటింగ్ చేయవద్దు అంటూ భార్యను మందలించాడు భర్త.


 దీంతో భర్త తన పై అనుమానం పెంచుకున్నాడు అంటూ మనస్తాపం చెందిన మౌనిక చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే మౌనిక ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్న ప్రశాంత్ చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రశాంత్ కి ఒక పాప భార్య ఉండడం గమనార్హం. ఇలా వాట్సాప్ చాటింగ్ లో మితిమీరిన చాటింగ్ ఏకంగా రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపింది. ఈ రెండు ఘటనల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: