నేటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతుంది. మనిషి జీవన శైలి లో ఊహించని రీతిలో మార్పులు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ మారుతున్న కాలాన్నిబట్టి అటు మనిషి ఆలోచన కూడా తగ్గిపోతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే చిన్నచిన్న కారణాలకే మనుషులు కాస్త విచిత్రంగా వ్యవహరించే ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయ్. ఇలా చిన్నచిన్న కారణాలకే ఏకంగా మనుషులు ఉన్మాదులు గా మారిపోతున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వనివారు దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు.



 మరికొంతమంది వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా ఆత్మహత్యకు పాల్పడుతూ దేవుడు ఇచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయ్. ఏకంగా ఒకరిపై ఒకరు పడి మరి కొట్టుకున్నారు. దీంతో ఇక ఇరు కుటుంబాలు లో ఉన్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు కుటుంబాల మధ్య ఈ రేంజిలో గొడవ జరిగింది అంటే ఏదో పెద్ద కారణమై ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా.



 కానీ ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరగడానికి  గల కారణం ఏంటి అని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అనే చెప్పాలి. ఇంతకీ గొడవ ఎందుకు అయింది అని అనుకుంటున్నారు కదా..  ఒకరిని చూసి ఒకరు నవ్వడం కారణంగా. ఈ ఘటన హైదరాబాదులోని రాజీవ్ గాంధీ నగర్ లో వెలుగులోకి వచ్చింది. ఎదురెదురుగా నివాసముంటున్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక మాటా మాటా పెరిగి కర్రలు రాళ్లతో దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది గొడవ.  అయితే ఒక వ్యక్తిని చూసి మరో వ్యక్తి నవ్వడంతోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: