సాధారణంగా రక్తం పంచుకుని పుట్టిన పిల్లల పై చేయి చేసుకోవడానికి తల్లిదండ్రులకు మనసు ఒప్పదు. ఇక ఎప్పుడైనా కాస్త ఎక్కువ మారం చేసినప్పుడు పొరపాటున చేయి చేసుకుంటే తల్లిదండ్రులు ఎంతగానో బాధ పడి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం పిల్లలను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులే చివరికి వారి ఉసురు తీస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టిన పిల్లల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు తల్లిదండ్రులు.  దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఒక తండ్రి ఇలాంటిదే చేశాడు. ఏకంగా తన కన్న కొడుకుని చేతులారా చంపేశాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కన్న కొడుకునే తండ్రి దారుణంగా హత్య చేయడానికి ఒక బలమైన కారణం ఉంది అని చెప్పాలి. ఉన్మాది లా మారిపోయిన కొడుకు కుటుంబ సభ్యులందరినీ వేధిస్తున్నాడు అన్న కారణంతో కోపంతో ఊగిపోయిన తండ్రి స్వయంగా కొడుకు ని హత్య చేశాడు.  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జిల్లా కీల్లం గ్రామంలో సూర్యనారాయణ పోలమ్మ దంపతులు ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెల వివాహం కాగా కుమారుడు రాము గతంలో ఆర్మీలో పని చేసేవాడు.


 తన ప్రవర్తన సరిగా లేదని చివరికి విధుల నుంచి తొలగించారు.  అదే కారణంతో కట్టుకున్న భార్య కూడా విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఉద్యోగం పోవడం భార్య ఛీ కొట్టడంతో రాము ప్రవర్తన మరింత దారుణంగా మారింది కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. చివరికి గ్రామస్తులు అతని తీరుతో విసుగు చెందారు. తరచూ కుటుంబ సభ్యులను మందలిస్తూ ఉండేవారు. అయితే ఇటీవల ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు రాము. మద్యం మత్తులో తల్లి పొలమ్మ తో గొడవ పడటం ప్రారంభించాడు. కోపంతో ఊగిపోయాడు తండ్రి సూర్యనారాయణ. కన్న కొడుకు ని దారుణంగా హత్య చేశాడు. తర్వాత  పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: