ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే. మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పటి మూఢనమ్మకాలు ఆచారాలు నేటి రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. ఆధునిక జీవనశైలి లోకి అడుగుపెడుతున్న మనిషి ఎప్పటికప్పుడు సరికొత్త గా జీవించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే  ఒకప్పుడు నమ్మినట్లుగా ప్రస్తుతం మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అన్న విషయాన్ని మాత్రం ఎవరూ నమ్మడం లేదు అని చెప్పాలి.


 ప్రతి ఒక్కరు కూడా ఆధునిక టెక్నాలజీతో నిండి పోయిన సమాజంలో అధునాతన  జీవనశైలిలో బ్రతుకుతున్నరు. ఇలాంటి టైం లో కూడా అక్కడక్కడ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి అన్న దానికి నిదర్శనం  గా కొన్ని ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఎంతో  మంది బురిడీ బాబాలు ప్రజల నమ్మకాలతో ఆటలు ఆడుతూ చివరికి మాయ మాటలతో భారీగా డబ్బులు గుంజుతున్న ఘటనలు వెలుగు  లోకి వస్తున్నాయి. పూజలు చేస్తాము అని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరి కొన్ని చోట్ల 
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చేతబడులు చేస్తున్నారు అన్న కారణంతో కొంతమంది పై దాడులకు పాల్పడి చేస్తున్న ఘటనలు కూడా అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 సికింద్రాబాద్ లో చేతబడి చేస్తుంది అనే ఆరోపణలతో ఒక మహిళను కుటుంబసభ్యుల దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మహిళను గొంతునులిమి హత్య చేసిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా మహిళది హత్య అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కుటుంబ సభ్యులే హత్య చేశారు అనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: