ప్రతి ఒక్కరు కూడా ఆధునిక టెక్నాలజీతో నిండి పోయిన సమాజంలో అధునాతన జీవనశైలిలో బ్రతుకుతున్నరు. ఇలాంటి టైం లో కూడా అక్కడక్కడ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి అన్న దానికి నిదర్శనం గా కొన్ని ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఎంతో మంది బురిడీ బాబాలు ప్రజల నమ్మకాలతో ఆటలు ఆడుతూ చివరికి మాయ మాటలతో భారీగా డబ్బులు గుంజుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. పూజలు చేస్తాము అని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరి కొన్ని చోట్ల
సికింద్రాబాద్ లో చేతబడి చేస్తుంది అనే ఆరోపణలతో ఒక మహిళను కుటుంబసభ్యుల దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మహిళను గొంతునులిమి హత్య చేసిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా మహిళది హత్య అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కుటుంబ సభ్యులే హత్య చేశారు అనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.