ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది అని చెప్పాలి. షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సోలిపూర్ శివారూలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీటి గుంతలో పడి బాలుడు మృత్యువాత పడ్డాడు. వ్యవసాయ కూలీగా పనిచేసే బిక్షపతి కుమారుడు అక్షిత్ సోమవారం ఉదయాన్నే దసరా పండక్కి దుస్తువులు కొనివ్వాలి అంటూ తండ్రిని అడిగాడు. తండ్రి కూడా తీసుకుందాంలే అంటూ హామీ ఇచ్చాడు. కానీ ఇదంతా జరిగే లోపే చివరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చివరికి విగత జీవిగా కళ్ళ ముందు కనిపించడంతో అరణ్య రోజునగా విలపించాడు ఆ తండ్రి.
అయితే తమకు ముగ్గురు కుమారులని అందులో చిన్నవాడు అక్షిత్ అని బిక్షపతి తెలిపాడు. చిన్న కుమారుడు కావడంతో ఎంతో అల్లారం ముద్దుగా చూసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి విషాదకర ఘటన జరుగుతుందని మాత్రం అనుకోలేదు అంటూ అక్షిత్ తల్లిదండ్రులు బిక్షపతి శివ లీల కన్నీరు మున్నీరుగా విలపించారు అని చెప్పాలి. పండక్కు ముందు జరిగిన ఈ విషాదకర ఘటనతో అటు కుటుంబంలోనే కాదు ఆ ప్రాంతం మొత్తంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి.